RSS

ఎంత పుణ్యం చేసికున్నానో కదా...

   అమ్మా! గంగమ్మతల్లీ! గంగని ఒక్కసారి కాకుండా అమ్మా, గంగమ్మ, తల్లీ అని మూడు సార్లు తలిస్తేనే కాని మనసు తీరదు. ఎక్కడ గంగ వుంటే అక్కడే పుణ్యస్థలం. గంగా జలం అమృతం తో సమానం. సాధారణంగా మన దేవుడి గదిలో గంగాజల చెంబులు చూస్తూవుంటాం ( సీలు వెసిన కాశీ చెంబు) .మరణ సమయంలో కొద్దిగా గంగాజలం నోట్లో పోస్తే స్వర్గం దొరుకుతుందని అంటారు. అవి అందుకే వుంచేవారనుకుంటాను. కాని హస్పటల్ మరణాల వల్ల అదీ కుదరటంలేదనుకోండి. అయినా అదంతా ఎందుకనుకోడి ఇప్పుదు. గంగమ్మతల్లి ని తలుచుకుంటే ఓ చిన్న కధ గుర్తు వస్తోంది అందరికి తెలిసే వుంటుందనుకుంటాను.

    నారదుడు గంగ దగ్గరకి వెళ్ళి స్నానం చేయకుండా నమస్కరించి వెళ్ళిపోయేవారట.ఎప్పుడు వచ్చినా అలా వెళ్ళిపోతూవుంటే ఆ తల్లికి చిరాకు కలిగిందట. చివరికి ఓ సారి అడిగేసిందట. నా ప్రవాహంలో గొప్ప గొప్ప ఋషులు, తప్పకుండా స్నానం చేస్తారు మీరు ఇలా ఓ నమస్కారం పెట్టి వెళ్ళిపోతున్నారు, విషయం ఏమిటని ? అందుకు నారదుడు అమ్మా! నిన్ను దర్శించినంతనే సకల పాపాలు పోయి ముక్తి లభిస్తుంది.ఇంక స్నానం చేయటం వలన అధిక ఫలం ఏముంటుంది తల్లీ? అన్నారట. అదీ గంగమ్మతల్లి వైభవం , గొప్పతనం.

    గంగ గంగోత్రి దగ్గర బయలు దేరి ప్రజలకి సుఖ సంపదలు , పుణ్య ప్రాప్తి కలిగించి గంగాసాగర్ వద్ద సముద్రంలో కలసిపోతుంది. అటువంటి పరమ పవిత్రమైన గంగానదిలో స్నానం చేసే అదృష్టం మాకు కలిగి, మా జన్మ తరించిదని సంతోషంగా వుంది. హరిద్వార్ లోని గంగమ్మను గంగాసాగరు లోని గంగమ్మను చూసే " హర హర గంగే.. హరహర గంగే అంటూ వేసిన మునక తో శరీరం , అత్మ పవిత్రమయ్యానే భావం కలిగింది. ఇక్కడ ఒకటి చెబుతాను. " మానొతో మై గంగా మా హుం, నా మానొతొ బహతా పానీ " పాట గుర్తుంది కదూ !

    హృషీకేశ్ లోని గంగమ్మ,భారత్ మందిర్, రామమందిర్, రామ్ ఝూలా, లక్ష్మణ్ ఝూలా, అన్ని చూసుకొని హరిద్వార్ వెళ్ళాము. శివాలిక్ పర్వత శిఖరాల లొయలొ గంగానది కుడివైపున హరిద్వారు వుంది. పరమ పవిత్రక్షేత్రాలో అగ్రగణ్యమైన దీన్ని దర్శిండం నాకు ఒక కల కాదుకదా అనిపిస్తోంది. హరిద్వార్ కి హృదయంలాంటి హరిపౌడి లో స్నానం , గంగమ్మహారతి వావ్! పండిత జగన్నాధ శాస్త్రి గారి హారతి ! తెలుగు వారి అదృష్టం. దీపాల వెలుగులో గంగమ్మ సౌందర్యం అనిర్వచనీయం. మా శ్రీవారు ఓ మూడు విడియోలు తీశారు. వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడా చూడండి.

    ముఖ్యంగా నాకు మరినూ! ఎత్తులన్నా, లోయలన్నా, నీళ్ళన్నా, మండిపడే మా శ్రీవారి తో మానసా దేవి మందిర్, చండీ దేవి మందిర్, దర్శించుకోవడం, అదీ ఉడన్ కటోలాలొ. ( రోప్ వే).అందుకే అంటారనుకుంటాను యోగం వుంటే అలా కలసి వస్తుందనుకుంటాను. మా మిత్రులు అమరేంద్ర గారి ప్రోత్సాహంతో అలా కుదిరింది. అందరికి మామూలు విషయంగా వుండచ్చును కాని నాకు మాత్రం ఈ ప్రయాణం అద్బుతం. అపూర్వం.

    ఇంతే కాదండోయ్.. గంగా తీరంలో దశహరా స్తోత్రం కూడా చదువుకునే భాగ్యం కలిగింది.

4 కామెంట్‌లు:

durgeswara చెప్పారు...

హరహర గంగే !

Hema చెప్పారు...

అదృష్టవంతులు. జన్మ ధన్య్తం చేసుకున్నారు.

Hema చెప్పారు...

అదృష్టవంతులు. జన్మ ధన్య్తం చేసుకున్నారు.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

దుర్గేశ్వర్ గారూ,

నిజమే...

హేమా,

అవునండీ.. ఇన్నాళకి ఆ అదృష్టం కలిగింది...

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes